కూతురిని కడతేర్చిన తల్లి...

SMTV Desk 2017-08-29 13:27:39  Mother, Daughter, Murder,Bengaluru

బెంగుళూరు, ఆగస్ట్ 29: తన కూతురి పట్ల కన్నా తల్లే కాల యముడిగా మారి, కూతురిని చంపిన విషాద సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... పుట్టేనహళ్ళి ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కాంచన్ సర్కార్, ఆయన భార్య స్వాతి లు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడు సంవత్సరాల పాప ఉంది. ఆమెకు మాటలు రావు. కాంచన్, స్వాతిల మధ్య గతకొంత కాలంగా తీవ్ర మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో భార్యకు దూరంగా కాంచన్ మరో ఇంట్లో ఒంటరిగా ఉంటూ, అప్పుడప్పుడూ వచ్చి పాపను చూసి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన కుమార్తె శ్రేయాను మూడో అంతస్తుకు తీసుకెళ్లిన స్వాతి, అక్కడి నుంచి క్రిందకు నెట్టేసింది. అనంతరం పాప ప్రాణాలతోనే ఉందని గమనించిన ఆ దుర్మార్గపు తల్లి మరోసారి పాపను పైకి తీసుకెళ్లి కింద పడేసింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మరణించగా, ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వెళ్లి టిప్పు టాపుగా తయారై బయటకు వచ్చింది. మరణించిన పాపను చూడకుండా ఎక్కడికి వెళుతున్నావని స్థానికులు నిలదీయగా, మాతృత్వం మంట కలిపిన ఆమె నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చింది. దీంతో స్థానికులు ఆమెను కరెంటు స్తంభానికి కట్టేసి, చావగొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.