నగరంలో భారీ చోరీ, 11 తులాల బంగారం ఎత్తుకుపోయిన దొంగలు

SMTV Desk 2019-06-03 15:46:13  robbery, hyderabad,

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ చోరీ జరిగింది. షాపింగ్ కోసం చార్మినార్ కు వెళ్లిన ఓ కుటుంబం.. తిరిగొచ్చే సరికి వారి ఇల్లును గుల్ల చేశారు దుండగలు. ఈ ఘటన నాగారంలోని సాయి ధరణి కాలనిలో జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి 11 తులాల బంగారం, సెల్ ఫోన్, 110000/- నగదు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు సమాచారమందించారు. ఏసీపీ శివకుమార్ ఘటనాస్థలికి చేరుకొని, యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.