చండీఘడ్, ఆగస్ట్ 28 : పదిహేనేళ్లు సుదీర్ఘంగా సాగిన కేసు నేటికి ఫుల్ స్టాప్ పడింది. వివాదాస్పద డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కి ఎలాంటి శిక్ష విధిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న క్రమంలో ఆయనకు సీబీఐ కోర్టు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇరు వర్గాల వాదనలు జరుగుతున్న క్రమంలో తాను సమాజ సేవ చేస్తున్నానని, క్షమాభిక్ష పెట్టాలని డేరా బాబా కన్నీటి పర్యంతమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసును ప్రత్యేక కోణంలో భావించి అతి కఠినాత్మకంగా శిక్షించాలన్న వాదనలు కూడా వినిపించాయి. దీంతో న్యాయస్థానం తనకు పదేళ్ళ జైలు శిక్షను అమలు చేసింది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రాంతంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశాలుండడంతో పొలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.