ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ జగన్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన జగన్ కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను సరికొత్త శిఖరాలకు చేర్చగలరని ఆశాభావం వ్యక్తంచేశారు.
కాగా ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన తన తొలి సంతకాన్ని వృద్ధాప్య పింఛన్లపై చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.