ఫ్లైఓవర్ పైకి రాగానే...మంటలు

SMTV Desk 2019-05-27 17:47:09  petrol tanker

ముంబైలో పెట్రోల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. ముంబైలోని గోరెగావ్ వద్ద వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారత్ పెట్రోలియంకు చెందిన ట్యాంకర్ ఫ్లైఓవర్ పైకి రాగానే ట్రక్ ముందు భాగంలో మంటలు మొదలయ్యాయి. అవి వేగంగా విస్తరించాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పెట్రోల్‌తో నిండి ఉన్న ట్యాంక్ వైపు మండలు వ్యాపించకుండా మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.