స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జడ్టీఈ తాజాగా తన మరో నూతన స్మార్ట్ఫోన్ బ్లేడ్ ఎ7ను చైనాలో ఈ రోజు రిలీజ్ చేసింది. రూ.6100 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 17వ తేదీ నుంచి లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.6 ఇంచుల డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, 4జీ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.