కేంద్రంలో బిజెపి విజయం ఖాయం

SMTV Desk 2019-05-06 14:38:32  Rajnath singh,

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జోస్యం చెప్పారు. సోమవారం ఉదయం లక్నోలోని స్కాలర్స్‌ హోమ్‌ స్కూల్‌లో రాజ్ నాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. మళ్లీ కేంద్రంలో బిజెపి విజయం ఖాయమన్నారు. అంతేకాదు మళ్లీ నరేంద్ర మోడీనే ప్రధాని అవ్వబోతున్నారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

అయితే, ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో లక్నో పార్లమెంట్ స్థానం కూడా కీలకమైంది. 1991లో మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి లక్నోలో గెలిచినప్పటి నుండి అక్కడ బిజెపి జెండా ఎగురుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తరుపున రాజ్‌నాథ్ సింగ్, ఎస్ పి – బిఎస్పీ తరుపున శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హా, కాంగ్రెస్ తరుపున ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ బరిలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఐదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.