కౌలాలంపూర్: ఆసియా స్క్వాష్ చాంపియన్షిప్లో భారత స్టార్లు మెరిసారు. భారత స్టార్లు జోష్న చిన్నప్ప, సౌరవ్ ఘోషల్ తమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జోష్న 11-7, 12-10, 11-3తో ఆరోసీడ్ శివసాంగరి సుబ్రమణ్యం (మలేసియా)పై గెలుపొందగా.. పురుషుల సెమీస్లో సౌరవ్ 11-2, 11-6, 11-4తో ఎన్ యో నాంగ్ (మలేసియా)ను ఓడించాడు.