న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు. లోక్సభ ఎన్నికల సందర్భంగా మోతీనగర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కేజ్రివాల్పై ..గుర్తుతెలియని వ్యక్తి ఆకస్మిక దాడి చేశాడు. ప్రజలకు అభివాదం చేస్తున్న కేజ్రివాల్పై ఒక్కసారిగా విరుచుకుపడ్డ దుండగుడు.. ఆయన చెంప చెల్లుమనిపించాడు. వెంటనే ఆ వ్యక్తిని ఆప్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గతంలోనూ కేజ్రీవాల్పై పలు మార్లు ఇలాంటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఆయనపై ఏడు సార్లకు పైగా దాడులు జరిగి ఉంటాయని సమాచారం.