పంజాబ్ పై టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దినేశ్ కార్తీక్.. ముందుగా కింగ్స్ పంజాబ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారిన నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకూ కింగ్స్ పంజాబ్, కేకేఆర్లు 12 మ్యాచ్ల చొప్పున ఆడి తలో ఐదు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచాయి. దాంతో ఇరు జట్లు చెరో పది పాయింట్లతో ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి