బీజేపీ ఐదేళ్ల పాలనలో రైతులు కన్నీరు పెట్టారు : మాయావతి

SMTV Desk 2019-05-03 17:59:18  Mayavati,

లోక్‌సభ ఎన్నికల్లో లీడింగ్ పార్టీలు ఐన బీజేపీ, కాంగ్రెస్‌ లకు తగిన గుణపాఠం చెప్పాలని బిఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ లోని సుల్తాన్‌ పూర్‌ లో ఎన్నికల ప్రచారంలో మాయావతి ప్రసగించారు. సాంప్రదాయిక పార్టీలకు దేశంలో చరమగీతం పాడాలని సూచించారు. బీజేపీ ఐదేళ్ల పాలనలో రైతులు కన్నీరు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు లాభం చేకూర్చే ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.