హ్యుందాయ్ ‘వెన్యూ’ బుకింగ్స్ స్టార్ట్!

SMTV Desk 2019-05-03 16:06:23  Hyundai venue, hyundai

హ్యుందాయ్ కంపెనీ మరికొద్ది రోజుల్లో సరికొత్త ఎస్‌యూవీ ‘వెన్యూ’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఈ కారు బుకింగ్స్ కూడా కంపెనీ అధికారికంగా ఓపెన్ చేసింది. కొత్త ఎస్‌యూవీ కస్టమర్లను ఆకర్షిస్తోందని, ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. కస్టమర్లకు బెస్ట్ గ్లోబల్ ప్రొడక్ట్స్‌ను అందించాలనే తమ అంకింతభావానికి వెన్యూ ఒక ఉదాహరణ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. కస్టమర్లు హ్యాందాయ్ వెన్యూ మోడల్‌ను ఆన్‌లైన్ ద్వారా హ్యందాయ్ వెబ్‌సైట్‌లో లేదా డీలర్‌షిప్స్ వద్దకు వెళ్లి కారును బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. దీనికి తొలిగా రూ.21,000 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ కారు ప్రధానంగా 4 వేరియంట్ల రూపంలో కస్టమర్లకు చేరువ కానుంది. అలాగే 3 ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. ఒకటేమో 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్. మరొకటేమో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇంకొకటేమో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. కంపెనీ మే 21న ఈ కారును మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. ఇందులో బ్లూలింక్ టెక్నాలజీని అమర్చనుంది. 33 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కనెక్టెడ్ ఫీచర్లు ఉంటాయి. కంపెనీ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం వొడాఫోన్ ఐడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.అలాగే ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ చార్జింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి భద్రతా ఫీచర్లున్నాయి.