బెంగళూరు, మే 03: పొద్దస్తమానం ఫోన్ మాట్లాడుతున్నందుకు భర్త మందలించాడని...ఓ భార్య కట్టుకున్న మొగుడ్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన కర్ణాటక రాష్ట్రం బాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... బెంగళూరు హోసరోడ్డు ప్రాంతానికి చెందిన ప్రేమ్ రాజ్ కి శిల్ప అనే యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ అనోన్యంగా ఉండేవారు. కాగా.. గత కొంతకాలగా భార్య శిల్ప(23) ఎక్కువ సమయం ఫోన్ లో గడుపుతోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రేమ్ రాజ్ తన భార్యను నిలదీసినందుకు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకునేది.
ఇదే విషయమై ప్రేమ్రాజ్ ఇటీవల ప్రశ్నించడంతో భార్యభర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. శిల్ప ఏప్రిల్ 26వ తేదీ బంధువుల ఇంటికెళ్లి వస్తానని వెళ్లింది కానీ..... మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇళ్లలో గాలించినా జాడ తెలియకపోవడంతో ప్రేమ్రాజ్ బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.