బీఎస్పీ – ఎస్పీ – ఆర్‌ఎల్డీల కూటమి నుండి భారత దేశానికి కొత్త ప్రధాని

SMTV Desk 2019-05-02 16:18:47  Akhilesh Yadav,

దేశానికి బీజేపేతర ప్రధాని రాబోతున్నారన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌. ములాయం సింగ్ యాదవ్ పీఎం రేసులో లేరని తెలిపిన ఆయన.. బీఎస్పీ – ఎస్పీ – ఆర్‌ఎల్డీల కూటమి దేశానికి కొత్త ప్రధానిని ఇవ్వబోతుందని చెప్పారు. అయితే ప్రధాని ఎవరనేది ఫలితాల తర్వాత నిర్ణయిస్తామని అఖిలేష్ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాలు బీజేపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈడీ, సీబీఐతో పాటు ఇతర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని అఖిలేష్‌ మండిపడ్డారు.