సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

SMTV Desk 2019-05-02 15:32:03  cbse results, cbse 12 results, cbse syllabus

హైదరాబాద్, మే 02: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. 12,87,359 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 83.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. త్రివేండ్రం రీజియన్‌లో 98.2 శాతం, చెన్నై రీజియన్‌లో 92.93 శాతం, ఢిల్లీ రీజియన్‌లో 91.87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హన్షిక శుక్లా, కరీష్మా ఆరోరా 499 మార్కుల చొప్పున సాధించి టాప్‌లో నిలిచారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగాయి. ఫలితాల కోసం cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్‌లను సంప్రదించొచ్చు.