రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు

SMTV Desk 2019-05-01 19:14:35  Ramdas Athwale

భారత్‌ లో కూడా బుర్ఖాలను నిషేధించాలన్న శివసేన డిమాండ్స్‌పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. బుర్ఖాలు ధరించిన మహిళలందరూ ఉగ్రవాదులు కాదని చెప్పారు రాందాస్ . కాని బుర్ఖా ధరించిన వారు ఉగ్రవాదులైతే వారి బుర్ఖాను తొలగించాల్సిందేనని పేర్కొన్నారు. భారతదేశంలో ముస్లిమ్ మహిళలు బుర్ఖా ధరించడం సంప్రదాయమన్నారు అథవాలే. దేశంలో బుర్ఖాపై నిషేధం విధించరాదన్నారు .