ఈ రోజు జరిగిన మహారాష్ట్ర గడ్చిరోలి నక్సల్స్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రధాని మోదీ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాడుల్లో మృతిచెందిన వీరజవానులకు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. జవానుల త్యాగం ఊరికే పోదని అన్న మోదీ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పోలీస్ వాహనమే లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సల్స్ పేలుళ్లు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 17మంది పోలీసులతో పాటు డ్రైవర్ కూడా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.