మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జిల్లాలో మావోయిస్టులు ఈ రోజు భీకర దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి 30కి పైగా రోడ్డు నిర్మాణ వాహనాలు ధ్వంసం చేసిన నక్సల్స్ ఈ రోజు పోలీసుల వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. పేలుడులో 17 మందికిపైగా పోలీసులు చనిపోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రధాన అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి వాహనం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. టైర్లు, స్టీరింగ్ వంటికి వందల అడుగుల దూరంలో ఎగిరిపడ్డాయి. డ్రైవర్ తో సహా వాహనంలోని అందరూ మృత్యువాత పడ్డారు.పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, నిన్న రాత్రి పురాందా-మాలేగావ్-యెర్కడ్ జాతీయ రహదారి నిర్మాణానికి వాడుతున్న 36 వాహనాలను నక్సల్ తగలబెట్టారు. అవి అమర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీవి. దాదాపూర్లోని ప్లాంట్లోకి చొరబడి వాటిని ధ్వంసం చేశారు. రూ. 10 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.