ఇటీవల శ్రీ లంక లో బుర్ఖాలపై నిషేదం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా బుర్ఖాలను బ్యాన్ చేయాలనే డిమాండ్స్ ఊపందుకుంటున్నాయి. మోడీ చొరవ తీసుకుని బుర్ఖాలను నిషేదించాలని ప్రముఖ రాజకీయ పార్టీ శివసేన పట్టుబడుతోంది. ఇటు హిందూసేన కూడా కేంద్రహోంశాఖకు లేఖ రాసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, బహిరంగ స్థలాల్లో బుర్ఖాలు, నికాబ్లు ధరించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదులు సీసీటీవీ కెమెరాల్లో పడకుండా బుర్ఖాలు ధరించి వచ్చి పేలుళ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో.. బుర్ఖాలను నిషేధించాలంటున్నాయి ఆయా సంస్థలు.