లక్నో : ఎస్ పి నేత రాకేష్ యాదవ్ మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. యాదవ్ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు కాల్పులు జరపారు. తీవ్రగాయాలపాలైన యాదవ్ అక్కడికక్కడే చనిపోయడు. ఆస్తి వివాదాల కారణంగానే యాదవ్ ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం యాదవ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బరోలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్ పి ఇంచార్జిగా యాదవ్ వ్యవహరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.