కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత పౌరుడే అన్న విషయం ప్రపంచం మొత్తం తెలుసు అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా. ఎన్నికల వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రధాని మోదీ కేంద్ర సంస్థలతో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించి, నల్లధనం గురించి మోదీ దగ్గర సమాధానాలుండవన్న సూర్జేవాలా.. అసత్య ఆరోపణలు చేయడంలో ఘనత సాధించాడని విమర్శించారు. కాగా రాహుల్ పౌరసత్వంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర హోంశాఖ తన పౌరసత్వంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది.