ఖతర్: ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2019లో భారత్ కు చెందిన గోమతి మరుముత్తు 800 మీటర్ల మహిళ విభాగంలో బంగారు పతకాన్ని సొంత చేసుకుంది. దీంతో టోక్యో 2020 ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. గోమతి ఆదాయ పన్ను శాఖ విభాగంలో ఉద్యోగిగా పని చేస్తుంది. తమిళనాడులో తిరుచురుపల్లిలో ఆమె జన్మించింది. దీంతో తమిళనాడులో ప్రధాన పార్టీలైన ఎఐడిఎంకె పార్టీ రూ.15 లక్షలు, డిఎంకె పార్టీ పది లక్షలు రూపాయల, కాంగ్రెస్ ఐదు లక్షల రూపాయల రివార్డును గోమతికి ప్రకటించాయి. ఒలంపిక్స్ కోసం చాలా కష్టపడుతానని, తనకు భారత ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు తన సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపింది.