న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడుత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 9 రాష్ర్టాల్లోని 72 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, నాలుగో విడత పోలింగ్తో కలిపి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 373 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మే 6వ తేదీన జరిగే ఐదో విడుత పోలింగ్లో 51 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, సాయంత్రం 5 గంటల వరకు బిహార్లో 44.33 శాతం, జార్ఖండ్లో 57.13 శాతం, ఉత్తరప్రదేశ్లో 53.23 శాతం, ఒడిశాలో 53.61శాతం, మహారాష్ట్రలో 42.52 శాతం, మధ్యప్రదేశ్లో 57.77శాతం, రాజస్థాన్లో 54.75శాతం, పశ్చిమ బెంగాల్లో 66.46 శాతం, జమ్ముకశ్మీర్లో 9.37 శాతం పోలీంగ్ నమోదైంది.