న్యూఢిల్లీ: ఐపిఎల్ 2019 సీజన్లో ఊహించని ఆటతీరును ప్రదర్శిస్తూ ఐపీఎల్ లోనే దిగ్గజ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను సైతం దాటేసి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. తాజాగా ఈ టీం ప్లేఆఫ్కు కూడా అర్హత సాధించింది. ఈ సీజన్లో ప్లేఆఫ్కు వెళ్ళిన రెండో జట్టుగా ఢిల్లీ ఉండగా మొదట చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్కు వెళ్ళిపోయింది. ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరడంతో పాటుగా ప్లేఆఫ్కు అర్హత సాధించింది. కాగా తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో కోహ్లీ సేన 12 మ్యాచ్లలో 8 మ్యాచ్లు ఓడిపోవడంతో టోర్నమెంట్నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లయింది.ఢిల్లీ నిర్దేశించిన 188 పరుగుల లక్షాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు 171 పరుగులకే పరిమితమైంది. పార్థీవ్ పటేల్ (20 బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్తో 39), విరాట్ కోహ్లీ (17 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్స్తో 23) తొలి వికెట్కు 63 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాట్స్మెన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు.