ఉత్తరప్రదేశ్ లో 13లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందంటున్నారు ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ బీజేపీ అభ్యర్థి, బోజ్ పూరి స్టార్ రవికిషన్. గుర్ గ్రామ్ లో ఓటేసిన ఆయన.. ప్రతీఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఫరుకాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.