త్వరలో మార్కెట్లోకి హీరో నుండి రెండు బైక్స్

SMTV Desk 2019-04-29 18:29:32  hero, hero xpulse 200t, hero xpulse 200

ముంభై: ప్రముఖ ఆటోమొబైల్స్ కంపెనీ హీరో తాజాగా మార్కెట్లోకి మరో 3 కొత్త బైక్స్ ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. మే 1న ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ అనే రెండు బైక్స్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే అధికారిక లాంచ్ కన్నా ముందే ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్ లైవ్ ఫోటోలు లీకయ్యాయి. రెండు బైక్స్‌లోనూ ఇంజిన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు. అయితే రైడింగ్ స్టైల్ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎక్స్‌పల్స్ 200, 200టీ అనేవి ఆఫ్‌రోడ్ బైక్స్. వీటిల్లో ఫ్లై‌స్క్రీన్, ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, బ్లూటూత్, నావిగేషన్, ఎల్ఈడీ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ బైక్ ధర రూ.1-రూ.1.1 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. ఈ ధరలో చూస్తే అత్యంత అందుబాటు ధరలో టూరింగ్ బైక్స్ ఇవే కానున్నాయి. కంపెనీ ఈ బైక్స్‌తోపాటు కరిజ్మ 200 అనే మరో కొత్త బైక్‌ను కూడా మార్కెట్‌లోకి తీసుకువచ్చే అవకాశముంది.