గురుదాస్పుర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పుర్ నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్న బాలీవుడ్ హీరో సన్నీడియోల్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల సన్నీడియోల్ బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. 62 ఏళ్ల సన్నీడియోల్ అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం గురుదాస్పూర్లో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సన్నడియోల్ వెంట సోదరుడు, హీరో బాబీ డియోల్ కూడా ఉన్నారు. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాలకుగానూ అమృత్ సర్, గురుదాస్పూర్, హోషియార్ పూర్లో కమలం పోటీ చేస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా సునిల్ జాకర్, సన్నీడియోల్ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. ఇక సన్నీడియోల్ తండ్రి సీనియర్ నటుడు ధర్మేంద్ర కూడా గతంలో బిజెపి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.