పశ్చిబెంగల్ లో పోలీసులు లాఠీ ఛార్జ్

SMTV Desk 2019-04-29 11:29:50  West Bengal,

కోల్‌కతా : నాల్గో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పశ్చిబెంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద టిఎంసి, బిజెపి కార్యకర్తలు గొడవకు దిగారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇదిలా ఉండగా ఆసన్ సోల్ లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రీయో కారుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ విడుతలో పశ్చిమబెంగాల్ లోని 8 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆసన్‌సోల్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద తృణమూల్‌ కార్యకర్తలు భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కేంద్ర బలగాలు లేకుండానే పోలింగ్ నిర్వహిస్తున్నారని తృణమూల్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ పోలింగ్ కేంద్రం వద్ద బిజెపి అభ్యర్థి అయిన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్దాలను తృణమూల్ కార్యకర్తలు పగలగొట్టారు. మంత్రిని అడ్డుకునేందుకు వారు యత్నించారు.