కోల్కతా: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ పై కోల్కతా 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక తొలుత ఇన్నింగ్స్ చేసిన కోల్కతా ఓపెనర్లు శుభమన్ గిల్ (76: 45 బంతుల్లో 6x4, 4x6), క్రిస్లిన్ (54: 29 బంతుల్లో 8x4, 2x6) హాఫ్ సెంచరీలు చేయగా 2 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో డికాక్ (0), రోహిత్ శర్మ (12), ఎవిన్ లావిస్ (15), సూర్యకుమార్ (15), కీరన్ పొలార్డ్ (20) తక్కువ స్కోరుకే ఔటైనా.. ఒంటరి పోరాటం చేసిన హార్దిక్ పాండ్య (91: 34 బంతుల్లో 6x4, 9x6) భారీ సిక్సర్లతో కాసేపు కంగారుపెట్టినా.. ఎట్టకేలకి అతడ్ని ఔట్ చేసిన కోల్కతా.. వరుసగా ఆరు మ్యాచ్ల తర్వాత మళ్లీ విజయాన్ని అందుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్లో ముంబయి గెలిచింటే..? ప్లేఆఫ్ బెర్తు ఖాయమయ్యేది. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ జట్లు ప్లేఆఫ్కి చేరిన విషయం తెలిసిందే. మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రసెల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.