టాలీవుడ్ లో కథను బట్టి ఆయా నటుల నట విశ్వరూపం బయటపడుతుంటుంది. అది నిజం. ఎందులోనైనా అది కాదనరాని సత్యం. టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న హీరోల్లో ఆది పినిశెట్టి ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం దొరికినప్పుడు ఆయా పాత్రల్లో అట్టే ఒదిదిపోయారు. అద్భుత నటనను ప్రదర్శించి చూపారు.
అయితే ఇప్పుడు ఆది పినిశెట్టి హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కబోతుంది. కానీ.. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. చాలా కాలం తర్వాత ఆది పినిశెట్టి సినిమాలో నటించేందుకు ఒకే చెప్పింది. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.