ముంభై: ఎయిర్ ఇండియా సర్వర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా తమ సర్వీసులను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఈ సమస్య చోటుచేసుకోవడంతో.. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో నిలిచిపోయారు. అయితే సీటా-డీసీఎస్ సిస్టమ్స్ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా అన్ని సర్వీసులకు అంతరాయం కలిగిందని వెల్లడించింది. ఈ సమస్యను అధిగమించడానికి తమ సాంకేతిక బృందం పని చేస్తోందని.. తొందరలోనే దీనిని పరిష్కరిస్తామని తెలిపింది.