సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో లక్నోలోని పీజీఐ ఆసుపత్రిలో చేరారు. గాస్ట్రో, న్యూరోలాజికల్ సమస్యలను ములాయం తమ దృష్టికి తేవడంతో ఆయనను అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు జరుపుతున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ములాయం సింగ్కు చెప్పుకోదగిన ఆరోగ్య సమస్య ఏమీ లేవని, కొద్ది గంటల్లోనే డిశ్చార్స్ చేస్తామని పీజీఐ వైద్యులు తెలిపారు. రొటీన్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. 79 ఏళ్ల ములాయం సింగ్ ఈ లోక్సభ ఎన్నికల్లో మెయిన్పురి నుంచి బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ శక్యాతో తలపడనున్నారు.