ప్రముఖ గాయకుడు దలెర్ మెహిందీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన గానంతో ప్రేక్షకులను అలరించిన దలెర్ మెహిందీ తాజాగా ప్రజాసేవకు పూనుకున్నారు. దలెర్ మెహిందీ ఇవాళ బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ వాయువ్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి హన్స్రాజ్ హన్స్, కేంద్రమంత్రి విజయ్ గోయల్ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, చాందినీ చౌక్ అభ్యర్థి హర్షవర్దన్తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దలెర్ మెహిందీ కూతురు ప్రముఖ సింగర్, బీజేపీ నేత హన్స్రాజ్ హన్స్ కుమారుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.