మహర్షి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతంగా నటించాడని నటి జయసుధ కొనియాడారు. మహేష్ యాక్టింగ్ రెండు సీన్లలో హైలెట్ గా ఉంటుందని, ఈ సీన్లు చూసిన తరువాత తనకు దుఃఖం వచ్చిందని, మహేష్ నటనకు అవార్డు వస్తుందని జయసుధ తెలిపారు. విజయ నిర్మలకు బంధువు కావడంతో కృష్ణ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, మహేష్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని పేర్కొన్నారు. మహర్షి మూవీలో ప్రకాశ్ రాజ్ సతీమణిగా నటించానని, ఈ చిత్రాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి గొప్పగా చిత్రీకరించాడని పొగిడారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. ఈ చిత్రంలో మహేష్కు జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్, మీనాక్షి దిక్షిత్, ప్రకాశ్ రాజ్, తదితరులు నటిస్తున్నారు. మహర్షి సినిమా మే-9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.