మూడో విడత ప్రచారం ముగింపు

SMTV Desk 2019-04-21 17:00:17  elections campaign, loksabha election, bjp, congress

ఎల్లుండి జరగనున్న మూడో విడత పోలింగ్ సందర్భంగా నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. చివరి రోజు భారీగా ప్రచారం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నాయి పార్టీలు. ఎల్లుండి జరగనున్న మూడో విడతలో 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 115 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. యూపీలో 10,ఒడిశాలో 6, మహారాష్ర్టలో 14, కర్ణాటకలో 14 లోక్‌ సభ స్థానాలతో పాటు,గుజరాత్‌, కేరళ, జమ్ముకశ్మీర్‌ లో పోలింగ్ కు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక మూడో దశలో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ లో పోలింగ్ జరగనుంది.