‘డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది

SMTV Desk 2019-04-21 15:50:53  Ram charan, Upasana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ‘దాదా సాహెబ్ ఫాల్కే-ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. శనివారం ముంబైలో జరిగిన ఫాల్కే అవార్డుల కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారం దక్కింది. భార్యకు ప్రతిష్టాత్మక అవార్డు రావడంపై రామ్ చరణ్ స్పందించారు.

ఉపాసన అవార్డు పట్టుకున్న ఫొటోను చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘డియరెస్ట్‌ ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఫిలాన్‌త్రోపిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్‌’ అని పేర్కొన్నారు.

అంతకుముందు ఉపాసన తాను అవార్డు అందుకొన్న ఫోటోని షేర్ చేసింది. ‘చాలా సంతోషంగా ఉంది. సోషల్‌మీడియాలో నాకు మెసేజ్‌లు చేస్తూ, నన్ను మోటివేట్‌ చేస్తున్నవారికి ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి కార్యక్రమానికి నా వెన్నంటే ఉంటూ మద్దతుగా నిలిచిన నా కుటుంబానికి ధన్యవాదాలు’ అని ఉపాసన రాసుకొచ్చారు.