ఢిల్లీ: ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. దీనితో ఢిల్లీలో ఆప్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. ఆప్ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ నో చెప్పడంతో ఆ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండవని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. కాంగ్రెస్కు మూడు సీట్లు ఇవ్వడం అంటే, ఆ సీట్లును బీజేపీకి సమర్పించినట్లు అవుతుందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో 4-3 సీట్ల చొప్పున పోటీ చేద్దామని కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ను ఆమ్ ఆద్మీ తిరస్కరించింది.