యూపీ, ఆగస్ట్ 17 : ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టి౦దంటారు. కాని కొన్ని చోట్ల మహిళలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురుషులతో పోలిస్తే అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నప్పటికీ కొందరు తల్లిదండ్రులు తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పురిటిలోనే ఆడపిల్లలను చంపడం ఆపడం లేదు. తాజాగా అలాంటి పరిణామమే ఉత్తరప్రదేశ్ లోని బులంద్షెహర్లోని కొత్వాలీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆరిఫ్ దంపతులకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆరీఫ్ భార్య మూడో కాన్పులోను మళ్ళీ ఆడపిల్లకే జన్మనివ్వడంతో కోపం తట్టుకోలేకపోయిన ఆరీఫ్.. తుపాకీతో తన భార్యపై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్ కంట్లోంచి దూసుకెళ్ళడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన తర్వాత ఆరీఫ్, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.