న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా పిఎం నరేంద్ర మోది. ఈ సినిమాను సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ సినిమాను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ చిత్రం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 5నే విడుదలయ్యేది. కాని ఎన్నికల ముందు బయోపిక్ను విడుదల చేయడానికి వీల్లేదని విపక్షాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం తాజాగా తీర్పునిస్తూ.. సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రానందున విడుదలను వాయిదా వేయలేమని వెల్లడించింది. సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా ? అన్నది కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుందని తెలిపింది. ఈ చిత్రం విడుదలకు ఈసీ అడ్డు చెప్పడంతో మే 19 తర్వాతే విడుదల కానుంది.