హైదరాబాద్: థాయ్ లాండ్లోని బ్యాంకాక్ వేదికగా జరిగిన ఏయూ తైక్వాండో అంతర్జాతీయ చాంపియన్షిప్లో వైఎంసిఏ నారాయణగూడ యమగూచి తైక్వాండో అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. ఈ టోర్నీలో యమగూచి ప్లేయర్లు 3 పతకాలను సాధించారు. అకాడమీకి చెందిన కరణ్ స్వర్ణంతో మెరవగా…ఎస్.ఎన్.పూజ, మహాదేవ్ చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను యమగూచి తైక్వాండో అకాడమీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షులు ఆర్కె కృష్ణ, ఉపాధ్యక్షులు స్వప్నారెడ్డి, కార్యదర్శులు పి.సంధ్య, బిజె వినయ్ స్వరూప్, కోచ్ డి.విశ్వనాథ్ పాల్గొన్నారు.