న్యూఢిల్లీ : గురువారం నాడు క్రిస్టియన్ మైకేల్కు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. క్రిస్టియన్ అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిస్టియన్ మైకేల్ యొక్క భాగస్వామి ఐన డేవిడ్సన్ కూడా నిందితుడిగా పేర్కొనబడ్డాడు. సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు దీనికి సంబంధించిన 2000 పేజీల నివేదిక ఉంది. ఈ కేసుపై ఛార్జిషీటు విచారణకు తీసుకుంటామని అన్నారు. గత ఏడాది డిసెంబరులో యుఎఈ నుంచి ఈ కేసులో అరెస్టయిన మైకేల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈయనపై అగస్టా వెస్ట్ల్యాండ్ ఒప్పందం కుంభకోణానికి సంబంధించి సిబిఐ, ఈడి కేసులతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.