న్యూఢిల్లీ, ఆగస్ట్ 15 : ఈరోజు భారత్ 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ... ముందుగా దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. స్వాతంత్య్ర సమయంలో ప్రాణాలర్పించిన మహనీయులను అందరూ స్మరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పలువురు మంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు.