శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దరాల్ ప్రాంతంలోని ఉజ్జాన్-దండ్కోట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు శనివారం అర్థరాత్రి ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు.