సమాజంలో మార్పు కోసం

SMTV Desk 2019-03-31 12:45:01  upendra,

బెంగళూరు: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పార్టీ తరపున లోక్‌సభకు పోటీ చేసే 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సమాజంలో మార్పు కోసం, సామాన్యుల అభివృద్ధి కోసం.. ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రజలు తమ మద్దతు తెలపాలని ఉపేంద్ర ప్రజల్ని కోరారు. పారదర్శకతే లక్ష్యంగా సామాన్యుల చేత పోటీ చేయిస్తున్నానని ఆయన తెలిపారు. అంతేకాదు తమ పార్టీ గుర్తు ఆటో కాబట్టి తమ పార్టీ అభ్యర్థులంతా ఖాకీ చొక్కాలు వేసుకుని ప్రచారం చేస్తారని ఆయన పేర్కొన్నారు. గెలుపు కోసం కాకుండా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తానని ఉపేంద్ర వెల్లడించారు.