న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్లు సెమీఫైనల్కు చేరుకున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్ ఫైనల్స్ పోటీల్లో శ్రీకాంత్, కశ్యప్లు విజయం సాధించారు. సాయి ప్రణీత్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ చెమటోడ్చి విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో శ్రీకాంత్ 2123, 2111, 2119 తేడాతో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు కొనసాగింది. ప్రణీత్ చూడచక్కని షాట్లతో శ్రీకాంత్కు గట్టి పోటీ ఇచ్చాడు. దీంతో శ్రీకాంత్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ప్రణీత్ తొలి సెట్ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్లో శ్రీకాంత్ పుంజుకున్నాడు. తన మార్క్ ఆటతో అలరించాడు. ప్రణీత్ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో చెలరేగిన శ్రీకాంత్ అలవోకగా సెట్ను సాధించాడు. దీంతో ఫలితాన్ని తేల్చే మూడో సెట్ ఇద్దరిరి కీలకంగా మారింది. ఇందులో కూడా ఇద్దరు సర్వం ఒడ్డి పోరాడారు. ప్రతి పాయింట్ కోసం ఉత్కంఠ సమరం తప్పలేదు. కీలక సమయంలో శ్రీకాంత్ పట్టు నిలబెట్టుకున్నాడు. ప్రణీత్ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక పోయాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన శ్రీకాంత్ సెట్తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్కు చేరుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో తెలుగుతేజం కశ్యప్ అలవోక విజయం సాధించాడు. చైనీస్తైపి ఆటగాడు వాంగ్జు వితో జరిగిన పోరులో కశ్యప్ 2116, 2116తో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే కశ్యప్ దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడుతూ ముందుకు సాగాడు. ఈ క్రమంలో వరుసగా రెండు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. ఇదిలావుండగా మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్కు చెందిన సిక్కిరెడ్డిఅశ్విని పొన్నప్ప జోడీకి చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో భారత జంట 1021, 1821 తేడాతో గ్రేసియా పొలిఅప్రియాని రహాయు జంట చేతిలో ఓటమి చవిచూసింది