ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ప్రెస్ వేపై వెళుతున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.