కాంగ్రెస్ నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆలయాలను సందర్శిస్తారు

SMTV Desk 2019-03-28 19:15:09  congress,

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బాబూలాల్ గౌర్ కాంగ్రెస్ సీనియర్ నేత‌ దిగ్విజయ్ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అతను ఒక హిందువు అయితే అయోధ్యలోని రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని దిగ్విజయ్ సింగ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆలయాలను సందర్శిస్తారంటూ ఎద్దేవా చేశారు.

దిగ్విజయ్ సింగ్ భోపాల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక దేవాలయాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన హిందువుల సంప్రదాయాన్ని తానూ పాటిస్తానన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం తనను శత్రువులా చూస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాబూలాల్ గౌర్ రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ద్వారా హిందువుగా తన ఉనికి చాటుకోవాలని దిగ్విజయ్ సింగ్‌ను డిమాండ్ చేశారు.