మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

SMTV Desk 2019-03-28 13:34:13  loksabha,elections,

లోక్‌సభ మూడో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపింది ఈసీఐ. ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి మే 19 వరకు ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా.. మూడో దశలో 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. లోక్‌సభ మూడోదశ ఎన్నికలకు ఏప్రిల్ 4 వరకూ నామినేషన్ల స్వీకరణ. ఏప్రిల్ 5న నామినేషన్ల పరిశీలిన, కాగా.. ఏప్రిల్ 8న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది సీఈసీ. లోక్‌సభ మూడోదశ ఎన్నికలు 23న పోలింగ్, మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్నాయని సీఈసీ సునీల్‌ అరోరా.