అసెంబ్లీలో బిజెపి బలం మరింత మెరుగు

SMTV Desk 2019-03-27 13:17:46  BJP,

ప‌నాజీ: గోవాలో బిజెపి బలోపేతమైంది . అసెంబ్లీలో బిజెపి బలం మరింత పెరిగింది. గోమాంతక్ పార్టీకి చెందిన (ఎంజిపి)కు చెందిన ఇద్దరు ఎంఎల్ఎలు మంగళవారం రాత్రి బిజెపిలో చేరారు. ఈ క్రమంలో అసెంబ్లీలో 12 మంది ఎంఎల్ఎలు ఉన్న బిజెపి సంఖ్యా బలం 14కు చేరుకుంది. ఎంజిపి ఎంఎల్ఎల సహకారంతోనే గోవా సిఎం ప్రమోద్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన విషయం తెలిసిందే. తాము బిజెపిలో చేరుతున్నట్టు ఎంజిపికు చెందిన ఇద్దరు ఎంఎల్ఎలు మనోహర్ అగోంకర్, దీపక్ పావాస్కర్ లు లేఖలు అందించారు. మరో ఎంజిపి ఎంఎల్ఎ సుదిన్ మాత్రం బిజెపిలో చేరేందుకు నిరాకరించారు. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ లు 14 సీట్లతో సమానంగా ఉన్నాయి.