సీనియర్లకు విలువ లేకుండా చేస్తున్న బిజెపి!

SMTV Desk 2019-03-27 10:22:10  bjp, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 26: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెనర్ల జబితాను విడుతల చేసింది. అయితే ఈ జాబితాలో పార్టీ సీనియర్‌ లీడర్లు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్‌ జోషిలకు చోటు దక్కలేదు ఇప్పటికే లోక్‌సభ బరిలో ఇద్దరికి సీట్లు నిరాకరించిన బిజెపి ఇప్పడు ప్రచారం విషయంలోనూ పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన సీనియర్లను పక్కన పెట్టడం .. వారిని కించపర్చడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీనియర్లకు విలువ లేకుండా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.